Sakshi News home page

తెలుగు రాష్ట్రాలలో చెదురుమదురు వర్షాలు

Published Sun, Oct 9 2016 7:10 AM

తెలుగు రాష్ట్రాలలో చెదురుమదురు వర్షాలు

విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఇది ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరంపై కొనసాగుతుందని పేర్కొంది. అలాగే ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ, కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కరుస్తాయని చెప్పింది. అయితే కోస్తాంధ్రలో కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

What’s your opinion

Advertisement