స్పీకర్‌తో సెల్వం వర్గీయుల భేటీ | panneru selavam supporters meet assembly speaker | Sakshi
Sakshi News home page

స్పీకర్‌తో సెల్వం వర్గీయుల భేటీ

Feb 17 2017 1:48 PM | Updated on Sep 5 2017 3:57 AM

స్పీకర్‌తో సెల్వం వర్గీయుల భేటీ

స్పీకర్‌తో సెల్వం వర్గీయుల భేటీ

మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్‌తో సమావేశమయ్యారు.

చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ ఉత్కంఠగా మారాయి. రేపు (శనివారం) అసెంబ్లీలో బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్‌తో సమావేశమయ్యారు. రహస్య ఓటింగ్ ద్వారా బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పన్నీరు వర్గంలో ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, శశికళ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పళనిస్వామి బెంగళూరు పర్యటనను రద్దు చేసుకుని.. ఎమ్మెల్యేలను క్యాంపుగా ఉంచిన గోల్డెన్ బే రిస్టార్‌కు వెళ్లి వారితో సమావేశమయ్యారు. ఇక ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పార్టీ నేతలతో సమావేశమై రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement