పారిశుద్ధ్యం మెరుగు మనందరి బాధ్యత | medical departments instructions over health precautions | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం మెరుగు మనందరి బాధ్యత

Sep 21 2016 11:02 AM | Updated on Oct 9 2018 7:11 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం మనందరి బాధ్యత అని వైద్యాధికారులు చెప్పారు.

కర్నూలు : ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం మనందరి బాధ్యత అని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.వీరాస్వామి వైద్యాధికారులు, సిబ్బందికి చెప్పారు. మంగళవారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో ఆయా విభాగాల ప్రొఫెసర్లు, హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులతో ఆయన సమావేశమయ్యారు.

ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, సెక్యూరిటీల విధులపై సమీక్షించారు. శుభ్రతపై రోగులను, వారి కుటుంబీకులను చైతన్యపరచాలన్నారు. బయోవేస్ట్‌ నిర్వహణను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇన్‌చార్జి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ వై. శ్రీనివాసులు, ఏడీ మోహన్‌ప్రసాద్, ఏవో భరత్‌మోహన్‌ సింగ్‌పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement