breaking news
health precautions
-
వరద ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్ఎంను ఫోన్లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
పారిశుద్ధ్యం మెరుగు మనందరి బాధ్యత
కర్నూలు : ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం మనందరి బాధ్యత అని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి వైద్యాధికారులు, సిబ్బందికి చెప్పారు. మంగళవారం ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో ఆయా విభాగాల ప్రొఫెసర్లు, హెడ్నర్సులు, స్టాఫ్నర్సులతో ఆయన సమావేశమయ్యారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, సెక్యూరిటీల విధులపై సమీక్షించారు. శుభ్రతపై రోగులను, వారి కుటుంబీకులను చైతన్యపరచాలన్నారు. బయోవేస్ట్ నిర్వహణను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇన్చార్జి సీఎస్ఆర్ఎంవో డాక్టర్ వై. శ్రీనివాసులు, ఏడీ మోహన్ప్రసాద్, ఏవో భరత్మోహన్ సింగ్పాల్గొన్నారు.