
కట్టుకున్నోడే కాలయముడు!
ఆస్తి, డబ్బు విషయంలో గొడవపడి ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు.
భార్య పేరుమీద ఉన్న స్థలాన్ని తనకు రాసివ్వాలని జానకిని పీడించేవాడు. ఇదే విషయపై దంపతులు పలుమార్లు గొడవపడేవారు. సోమవారం రాత్రి మరోసారి స్థలం విషయంలో ఘర్షణ జరిగింది. అది తీవ్రస్థాయికి చేరడంతో ఆగ్రహానికి గురైన చంద్రశేఖర్ పిల్లలు నిద్రలోకి జారుకున్న తరువాత భార్య గొంతుకు తాడు బిగించి హత్య చేసి ఉడాయించాడు. మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచిన ఓ చిన్నారి అచేతనంగా పడి ఉన్న తల్లి వద్ద రోదిస్తుండటంతో మిగతా పిల్లలు లేచారు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామ్పుర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.