విక్రమ్‌తో తొలిసారి

విక్రమ్‌తో తొలిసారి - Sakshi


 విక్రమ్‌తో నటించడం సంతోషాన్ని కలిగిస్తోందని నటి కాజల్ అగర్వాల్ తెలిపారు. కాజల్ అగర్వాల్ ఇదివరకే విజయ్, సూర్య, కార్తి, ధనుష్‌తో నటించారు. ఇంతవరకు విక్రమ్‌తో నటించలేదు. ప్రస్తుతం తొలిసారిగా విక్రమ్‌కు జంటగా నటించేందుకు అంగీకరించారు. పలువురి హీరోయిన్ల పోటీ మధ్య ఈ అవకాశం కాజల్‌కు దక్కింది. దీని గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ విక్రమ్‌తో నటించనుండడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.


విక్రమ్ అంటే చాలా ఇష్టమని, అతని నటన ఎంతో నచ్చుతుందన్నారు. విక్రమ్ ప్రతిభాశీలి, కష్టపడి పనేచేసే త త్వం కలవారన్నారు. ఆయనతో కలిసి నటించేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కథ, తన పాత్ర అద్భుతంగా వుందన్నారు. ఈ చిత్రంలో మరో కథానాయకిగా ప్రియా ఆనంద్ నటిస్తున్నారని తెలిపారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా మారి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముగిసి రిలీజ్ కు సిద్ధమవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందే చిత్రంలోనూ విశాల్‌కు జంటగా నటిస్తున్నారు. రెండు హిందీ చిత్రాలు కైవశంలో వున్నాయి.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top