వైఎస్‌ఆర్సీపీ నేతలపై పోలీసుల దౌర‍్జన‍్యం | former mla jogi ramesh protest against police harassment | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్సీపీ నేతలపై పోలీసుల దౌర‍్జన‍్యం

Feb 13 2017 11:16 AM | Updated on Aug 21 2018 7:39 PM

వైఎస్‌ఆర్సీపీ నేతలపై పోలీసుల దౌర‍్జన‍్యం - Sakshi

వైఎస్‌ఆర్సీపీ నేతలపై పోలీసుల దౌర‍్జన‍్యం

కృష్ణా జిల్లా జి. కొండూరు మండలంలో వైఎస్‌ఆర్సీపీ నేతలకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి.

విజయవాడ: కృష్ణా జిల్లా జి. కొండూరు మండలంలో వైఎస్‌ఆర్సీపీ నేతలకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. మట్టి వివాదంలో పామర్తి సాంబశివరావు, వంశీ అనే వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసులు నమోదు చేయకుండా పలు పోలీస్‌స్టేషన‍్లకు తిప్పుతున్నారు. మంత్రి దేవినేని ఉమ ఆదేశాలతోనే పోలీసులు అత్యుత్సాహం చూపుతూ వైఎస్సార్‌సీపీ నేతలను కావాలని వేధిస్తున్నారని  మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆరోపించారు. పోలీసుల దాష్టీకానికి నిరసనగా ఆయన జి.కొండూరు పోలీసు స్టేషన్‌ ఎదుట సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. వైఎస్సార్‌సీపీ నేతలను తక్షణం విడుదల చేయాలని, అంతవరకూ ఆందోళన ఆగదని ఆయన హెచ‍్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement