చెరకు మద్దతు ధర విషయమై చెరకు కర్మాగారాల యాజమాన్యానికి తలొగ్గిన ప్రభుత్వం ఇప్పుడు ఆయా చక్కెర పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ అమ్మకం విషయంలోనూ
- విక్రయానికి సిద్ధమవుతున్న చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు
- పట్టించుకోని ప్రభుత్వం
- రాష్ట్ర ప్రజలకు ఇక్కట్లే
సాక్షి, బెంగళూరు : చెరకు మద్దతు ధర విషయమై చెరకు కర్మాగారాల యాజమాన్యానికి తలొగ్గిన ప్రభుత్వం ఇప్పుడు ఆయా చక్కెర పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ అమ్మకం విషయంలోనూ ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నట్లు వివ ుర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 9,221 మెగావాట్లకు చేరుకుంది. అయితే రాష్ట్రంలో వివిధ రూపాల్లో విద్యుత్ లభ్యత 8,600 మెగావాట్లకు మించడం లేదు. దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు ఉంటున్నాయి.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల్లో ఉన్న కో-జనరేషన్ ప్లాంట్ల వల్ల 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ విద్యుత్ కొనుగోలు కోసం కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకోసం యూనిట్కు రూ.5.50 చెల్లించడానికి కూడా అంగీకరించింది. అయితే యూనిట్ విద్యుత్కు రూ.6.50 చెల్లించాలని చక్కెర కర్మాగారాల యాజమాన్యం పట్టుబడుతోంది. ప్రస్తుతం కేపీటీసీఎల్ వివిధ రూపాల్లో కొనుగోలు చేస్తున్న విద్యుత్కు కనిష్టంగా రూ.4.50 గరిష్టంగా రూ.5.50 చెల్లిస్తోంది.
అందువ ల్ల చక్కెర మిల్లుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్కు కూడా అంతే చెల్లించగలమని కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువ ధరకు తాము విక్రయించలేమని చెబుతూ చక్కెర కర్మాగారాల యాజమాన్యం పొరుగు రాష్ట్రాలకే విద్యుత్ అమ్మడానికి నిర్ణయించుకున్నాయి. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ కూడా పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లి పోతే ఇక్కడి ప్రజలు చీకట్లలోనే మగ్గిపోవాల్సి వస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిస్సహాయస్థితి
యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వానికే అమ్మాలని చెబుతూ రాష్ట్ర విద్యుత్ చట్టంలో మార్పు తీసుకువచ్చారు. అయితే గత ఏడాది చక్కెర కర్మాగారం యజమానులు హైకోర్టుకు వెళ్లి తాము ఉత్పత్తి చేసిన విద్యుత్ను బయటి రాష్ట్రాలకు కూడా అమ్ముకోవడానికి అనుమతి తీసుకువచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో పట్టన ట్టు వ్యవహరించి బయటి రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ విషయంపై ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి మాట్లాడుతూ... పరిశ్రమల స్థాపనకు, నిర్వహణకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు తీసుకుంటున్న యాజమాన్యం కేవలం సొమ్ము ఎక్కువ వస్తుందన్న కారణంతో రాష్ట్ర ప్రజలను ఇక్కట్లపాలు చేయడం సరికాదు. ఇక రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల్లో చాలావరకూ అధికార పార్టీ నాయకులవే. అందువల్ల ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోతోంది.’ అని పేర్కొన్నారు.