ఎనిమిది కిలోల బంగారం పట్టివేత | Eight kgs of gold recovered Chennai | Sakshi
Sakshi News home page

ఎనిమిది కిలోల బంగారం పట్టివేత

Nov 24 2015 9:58 AM | Updated on Sep 3 2017 12:57 PM

చెన్నై విమానాశ్రయంలో మంగళవారం ఎనిమిది కిలోల బంగారం పట్టుబడింది.

చెన్నై: చెన్నై విమానాశ్రయంలో మంగళవారం ఎనిమిది కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ రెండున్నర కోట్ల రూపాయలుంటుందని  ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.  పోలీసుల తనిఖీల్లో భాగంగా ముందు  రెండు బ్యాగుల్లో  అక్రమంగా  రవాణా చేస్తున్న అయిదున్నర కిలోల  బంగారాన్ని  స్వాధీనం చేసుకున్నారు. 

 

ఆ తర్వాత బ్యాంకాక్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు  తన బ్యాగ్ లో  ఉన్న 2.5 కిలోల బంగారం తనది కాదని పోలీసులకు  ఫిర్యాదు చేశాడు.  దీంతో మొత్తం 8  కిలోల  గోల్డ్ ను  సీజ్ చేసిన అధికారులు... సదరు ప్రయాణికుడ్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని  బ్యాగ్ లోకి బంగారం ఎలా వచ్చిందనే విషయాన్ని ఆరా తీస్తున్నామని,   విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement