'19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు' | cid awareness seminar for Agrigold victims | Sakshi
Sakshi News home page

'19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు'

Sep 3 2016 3:53 PM | Updated on Aug 18 2018 5:57 PM

'19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు' - Sakshi

'19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు'

ఏపీలోని అగ్రిగోల్డ్ బాధితులతో సీఐడీ శనివారం అవగాహన సదస్సును నిర్వహించింది.

విజయవాడ: ఏపీలోని అగ్రిగోల్డ్ బాధితులతో సీఐడీ శనివారం అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను సీఐడీ అడిషనల్ డీజీ ద్వారకా తిరుమల రావు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎటువంటి అపోహలకు గురి కావొద్దని ఆయన తెలిపారు. ఇప్పటికే ఏపీలో రూ. 2,670 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు వెల్లడించారు. ఏపీలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, తర్వలోనే అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామి ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement