- ‘చైతాలి’ని ప్రచారకర్తగా నియమించిన సులభ్ ఇంటర్నేషనల్
- రూ. 10 లక్షల పారితోషికంతో సత్కారం
సాక్షి, ముంబై: తాను అడుగుపెట్టబోయే అత్తారింట్లో మరుగుదొడ్డి ఉండి తీరాలనే పట్టుబట్టిన నవ వధువు చైతాలికి పేరు ప్రఖ్యాతులతోపాటు నగదు జల్లు కురిసింది. సులభ్ ఇంటర్నెషనల్ సంస్థ ఏకంగా రూ.10 లక్షల నగదు బహుమతి ఇవ్వడంతోపాటు తమ సంస్థకు ప్రచార కర్తగా (బ్రాండ్ అంబాసిడర్) నియమించుకోనుంది. ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన ఈ పని రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్త గుర్తింపును సొంతం చేసుకుంది.
వివరాల్లోకెళితే.. రాష్ట్రంలోని అకోలా జిల్లా కారంజా రమజాన్పూర్కు చెందిన చందా అలియాస్ చైతాలి వివాహం ఈ నెల 15న జరిగింది. తాను అడుపెట్టబోయే అత్తారింట్లో మరుగుదొడ్డి లేదని, పెళ్లి కానుకగా రెడీమేడ్ మరుగుదొడ్డి ఇవ్వాలని తల్లిదండ్రులను, దగ్గరి బంధువులను కోరంది. ఆమె కోరుకున్న ప్రకారం ఫ్రీ-ఫ్యాబ్రికేటెడ్ మరుగుదొడ్డిని అందజేశారు. ఈ కథనాన్ని ‘సాక్షి’ సోమవారం ‘అత్తారింటి దారిదే’ శీర్షికతో ఫ్యామిలీ పేజీలో ప్రచురించింది.
విషయం తెలుసుకున్న సులభ్ ఇంటర్నేషనల్.. ఆమెను యువతులంతా ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో రూ.10 ల క్షల నగదు బహుమతితో పాటు, తమ సంస్థ ప్రచారకర్తగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. గతంలోనూ ఈ సంస్థ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలను గౌరవించింది. మధ్యప్రదేశ్కు చెందిన అనితా నరేను రూ.ఏడు లక్షలు పారితోషికం ఇచ్చి గౌరవించింది. రాష్ట్రానికి సంగీత అనే యువతి, అలాగే ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రయాంక భారతి, మరో ఇద్దరు మహిళలు తమ మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టి మరుగుదొడ్డిని నిర్మించుకున్నందుకు సులభ్ ఇంటర్నేషనల్ గౌరవించింది.
ఆ ‘కోడలే’ మా బ్రాండ్ అంబాసిడర్
Published Tue, May 19 2015 12:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement