దూరవిద్యా రీవాల్యుయేషన్ ఫలితాల వెల్లడి


గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య రీవాల్యుయేషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం, బీఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంల్‌ఐఎస్సీ కోర్సుల రీవాల్యుయేషన్ ఫలితాలను పీజీ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ భవనం ఆంజనేయరెడ్డి వెల్లడించారు. ఈ ఫలితాలను www.anucde.info వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను పోస్టుద్వారా వారి ఇంటి చిరునామాకు పంపుతామని పేర్కొన్నారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top