శుక్రవారం రాత్రి అన్నాడీఎంకే డివిజన్ కార్యదర్శి హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అన్నాడీఎంకే నేత హత్య
Mar 2 2014 12:00 AM | Updated on Sep 2 2017 4:14 AM
టీనగర్, న్యూస్లైన్: శుక్రవారం రాత్రి అన్నాడీఎంకే డివిజన్ కార్యదర్శి హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన రాయపేటలో చోటుచేసుకుంది. చెన్నై థౌజండ్లైట్స్ అజీజ్ ముల్క్ వీధికి చెందిన మోజస్(44). 109వ అన్నాడీఎంకే డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు. శుక్రవారం రాత్రి ఈయన స్నేహితులతో కలిసి చెన్నై రాయపేట న్యూ కాలేజీ సమీపంలో మద్యం సేవించారు. మోజస్, స్నేహితుల మధ్య గొడవ ఏర్పడింది. ఆగ్రహించిన స్నేహితులు మోజస్పై కత్తితో దాడి చేశారు.
ఈ దాడిలో మోజస్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ఇతన్ని స్థానికులు రాయపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందు తూ మోజస్ మృతి చెందాడు. ఈ సంఘటనపై రాయపేట పోలీసులు విచారణ జరిపారు. విచారణలో ఆరుగురు ఈ హత్యకు పాల్పడినట్టు తెలిసింది. పాతకక్షల కారణంగా ఈ హత్య జరిగినట్టు తెలిసింది.
Advertisement
Advertisement