28న అభినందన ర్యాలీ | Aam Aadmi Party sriking secret deal with Congress: Vijay Goel | Sakshi
Sakshi News home page

28న అభినందన ర్యాలీ

Dec 21 2013 11:16 PM | Updated on Mar 29 2019 9:18 PM

ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించిన ఢిల్లీవాసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘అభినందన ర్యాలీ’ని నిర్వహించనున్నట్టు

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించిన ఢిల్లీవాసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘అభినందన ర్యాలీ’ని నిర్వహించనున్నట్టు బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ తెలిపారు. ఈనెల 28న తల్కటోరా స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆప్ మధ్య రహస్య ఒప్పందం కుదరిందని ఆరోపించారు. ఇటీవల కాలంలో ఆమ్‌ఆద్మీపార్టీ, కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న రాజకీయ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ అంశాలన్నింటినీ త్వరలోనే ప్రజల ముందుకు తెస్తామన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉన్న అవినీతి కేసులు మాఫీ చేస్తామన్న ఒప్పందంతోనే కాంగ్రెస్ పార్టీ,ఆప్‌లు ప్రభుత్వ ఏర్పాటులో సహకరించుకుంటున్నాయి. అందుకు ఆప్ కూడా ఒప్పుకుంది’అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement