9న ఉత్సవాలను ప్రారంభించనున్న సీఎం సిద్ధరామయ్య
వివిధ రాష్ట్రాల నుంచి కళాకారుల రాక
బళ్లారి : హంపి ఉత్సవాలను రూ.6.5 కోట్లతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సమీర్శుక్లా తెలిపారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కన్నడ సాంస్కృతిక, పర్యాటక శాఖల నుంచి నిధులు విడుదల అవుతున్నట్లు తెలిపారు. వచ్చే నెల జనవరి 9న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హంపి ఉత్సవాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు పరమేశ్వరనాయక్, దేశ్పాండే, ఉమాశ్రీ, రోషన్బేగ్తో పాటు కేంద్ర మంత్రులు కూడా ఉత్సవాల్లో పాల్గొంటారని వివరించారు. ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణదేవ రాయ, ఎంపీ ప్రకాష్, విద్యారణ్య, దరోజీ ఈరమ్మ, హక్కబుక్క వేదికలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వీటిల్లో రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు.
విజయ నగర సామ్రాజ్య వైభవాన్ని ఉట్టి పడేలా సౌండ్ అండ్ లైట్ సిస్టమ్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు నృత్య పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాల నుంచి 60 మంది కళాకారులను పిలిపించనున్నామని తెలిపారు. గ్రామీణ క్రీడలకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. హంపి ఉత్సవాల్లో గాలి పటాల ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామని, ఆహార మేళాతో పాటు వివిధ రకాల స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హంపి ఉత్సవాలు చివరి రోజు పెద్ద ఎత్తున బాణసంచా పేలుడు కార్యక్రమాన్ని వినూత్న తరహాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు హైదరాబాద్కు చెందిన నిపుణులను రప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లాధికారి వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.
రూ.6.5 కోట్లతో హంపి ఉత్సవాలు
Published Wed, Dec 24 2014 1:20 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
నాణ్యమైన విత్తనాలతో ఆశించిన దిగుబడులు
గతానికంటే మెరుగైన సీట్లతో మళ్లీ జగనన్న పాలన
ఇరువర్గాలపై కేసులు నమోదు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఇంటర్ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
భద్రత వెరీ స్ట్రాంగ్
24న ఎంఎస్ఎంఈ వర్క్షాప్
అంగన్వాడీ కేంద్రాలుతనిఖీ చేసిన ఆర్జేడీ
నేడు మోదకొండమ్మ కొలువు సంబరం
సింహగిరి.. ఆధ్యాత్మిక ఝరి
తప్పక చదవండి
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement