అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు, ఐదుగురి మృతి | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘోర ప్రమాదం

Published Fri, Mar 17 2017 8:22 AM

అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు, ఐదుగురి మృతి

బెంగళూరు : కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లా మన్నెకోట వద్ద అంబులెన్స్‌ను రైలు ఢీకొనడంతో అయిదురు మహిళలు దుర్మరణం చెందారు. అయిదు నెలల చిన్నారికి ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా ప్రమాదం నుంచి అంబులెన్స్‌ డ్రైవర్‌, అయిదు నెలల చిన్నారి స్వల్పగాయాలతో  సురక్షితంగా బయటపడ్డారు.

మృతులు చెళ్లకెర తాలూకా తిమ్మాపురం వాసులుగా గుర్తించారు. లెవల్‌ క్రాసింగ్‌ వద్ద రైల్వేగేటు కాపాలదారుడు లేకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదం గురువారం రాత్రి 7.30 సమయంలో జరిగినట్లు చిత్రదుర్గ జిల్లా పోలీసులు తెలిపారు. క్రాసింగ్‌ లెవల్‌ దాటే ప్రయత్నంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ రైలు వేగాన్ని అంచనా వేయలేకపోయాడని పోలీసులు వెల్లడించారు. మృతి చెందినవారిని పోస్ట్‌ మార్టం నిమిత్తం తరలించారు.

Advertisement
Advertisement