ఎయిర్పోర్ట్లో 1.25 కిలోల బంగారం పట్టివేత | 1.25 KG gold seized at chennai airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో 1.25 కిలోల బంగారం పట్టివేత

Aug 7 2014 10:32 AM | Updated on Sep 2 2017 11:32 AM

దోహా నుంచి నగరానికి వచ్చిన ఇస్మాయిల్ అనే ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నై : దోహా నుంచి నగరానికి వచ్చిన ఇస్మాయిల్ అనే ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం ఉదయం దోహా నుంచి చెన్నై నగరానికి విమానం చేరుకుంది.

ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ లగేజీలో భారీగా బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం 1.25 కిలోలని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement