జింబాబ్వేతో తొలి వన్డేలో భారత బౌలర్లు రాణిస్తున్నారు.
హరారే: జింబాబ్వేతో తొలి వన్డేలో భారత బౌలర్లు రాణిస్తున్నారు. జట్టులో సీనియర్ బౌలర్లు లేకున్నా యువ ఆటగాళ్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. భారత బౌలర్లు బరీందర్ శ్రణ్, ధావల్ కులకర్ణి చెరో వికెట్ తీశారు.
బరీందర్ శ్రణ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జింబాబ్వే ఓపెనర్ పీటర్ మూర్ను అవుట్ చేశాడు. బరీందర్ బౌలింగ్లో మూర్ ఎల్బీగా వెనుదిరిగాడు. జింబాబ్వే పరుగుల వేట నెమ్మదిగా సాగింది. కాసేపటి తర్వాత ధావల్ కులకర్ణి.. మసకద్జ (14)ను అవుట్ చేశాడు. మసకద్జ వికెట్ల వెనుక ధోనీకి క్యాచిచ్చాడు. ప్రస్తుతం చిబాబా, ఎర్విన్ బ్యాటింగ్ చేస్తున్నారు.