యూకీ పరాజయం | Yuki Bhambri bows out in first round | Sakshi
Sakshi News home page

యూకీ పరాజయం

Oct 18 2018 10:29 AM | Updated on Oct 18 2018 10:29 AM

Yuki Bhambri bows out in first round - Sakshi

యాంట్‌వర్ప్‌ (బెల్జియం): యూరోపియన్‌ ఓపెన్‌ ఏటీ పీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ యూకీ బాంబ్రీ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 100వ ర్యాంకర్‌ యూకీ 6–7 (6/8), 7–5, 1–6తో ప్రపంచ 167వ ర్యాంకర్‌ సాల్వటోర్‌ కరూసో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో ఓడిన యూకీకి 6,200 (రూ. 5 లక్షల 20 వేలు) యూరోలు ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదే టోర్నీ డబుల్స్‌ విభాగం తొలి రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–ఆర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జంట 7–5, 6–4తో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–మిగెల్‌ వరేలా (మెక్సికో) ద్వయంపై గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement