ప్రొ కబడ్డీ టైటిల్పై టైటాన్స్ ధీమా
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్లో తమ జట్టు విజేతగా నిలుస్తుందని తెలుగు టైటాన్స్ యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని విశ్వాసం వ్యక్తం చేశారు. తొలి మూడు సీజన్లలో కేవలం అటాకింగ్పై దృష్టి పెట్టామని, ఈసారి బలమైన డిఫెన్స్ను తయారు చేసుకున్నామని ఆయన చెప్పారు. సీజన్ తొలి మ్యాచ్లో శనివారం పుణేరీ పల్టన్తో టైటాన్స్ తలపడుతుంది. గత కొద్ది రోజులుగా నగరంలో జట్టుకు శిక్షణా శిబిరం నిర్వహించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో టీమ్లోని కొత్త ఆటగాళ్లను ఫ్రాంచైజీ పరిచయం చేసింది. కెప్టెన్ రాహుల్ చౌదరి, సుకేశ్ హెగ్డేలను కొనసాగించిన ఈ జట్టు మిగతా ఆటగాళ్లను వేలంలో తీసుకుంది.
కోచ్ ఉదయ్కుమార్, రాహుల్తో కలిసి శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు. ‘గత ఏడాది అత్యుత్తమ డిఫెండర్గా నిలిచిన సందీప్ నర్వాల్ను మేం జట్టులోకి తీసుకున్నాం. జట్టు సభ్యులైన పాకిస్తాన్, ఇరాన్ ఆటగాళ్లు నేరుగా మ్యాచ్ బరిలోకి దిగుతారు. జట్టు తొలి లక్ష్యం సెమీ ఫైనల్కు చేరడం. సొంతగడ్డపై మాకు మంచి రికార్డు ఉంది కాబట్టి హైదరాబాద్లో జరిగే సెమీస్, ఫైనల్లలో కూడా విజయం సాధిస్తాం’ అని శ్రీనివాస్ చెప్పారు. హైదరాబాద్లో టైటాన్స్ మ్యాచ్లు జులై 3నుంచి 6 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతాయి. సెమీస్ 29న, ఫైనల్స్ 31న జరుగుతాయి.
ఈ సారి గెలుస్తాం
Published Thu, Jun 23 2016 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement