వైష్ణవికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఓపెన్ కరాటే టోర్నీలో శంకర్జీ స్మారక బాలికల హైస్కూల్కు చెందిన వైష్ణవి స్వర్ణాన్ని గెలుచుకుంది. కరీంనగర్లో జరిగిన ఈటోర్నీలో శంకర్ జీ విద్యార్థులు మొత్తం 11 పతకాలను కైవసం చేసుకున్నారు. ఇందులో 1 స్వర్ణం, 3 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. సీహెచ్ వైష్ణవి (పసిడి), బి. కీర్తి, ఎస్. కీర్తన, సి. తులసి (రజతాలు), భూమిక, అశ్విత, శోభ, ఎన్. దిశ, లావణ్య, హర్షిత, లావణ్య (కాంస్యాలు) పతకాలను గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. శ్రీనివాస్, శంకర్ జీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు