తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన | Tug of War Teams For Telangana Announced | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన

Jul 26 2019 9:55 AM | Updated on Jul 26 2019 9:55 AM

Tug of War Teams For Telangana Announced - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ టగ్‌ ఆఫ్‌ వార్‌ మహిళల, బాలికల చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎండీ ఎ. దినకర్‌బాబు, రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ సంఘం ప్యాట్రన్‌ చల్లా భరత్‌ కుమార్‌ రెడ్డి పాల్గొని రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్లను అందజేశారు. ఆగ్రాలోని గోవర్ధన స్టేడియం రైల్వే గ్రౌండ్‌లో ఈనెల 27 నుంచి 30 వరకు జాతీయ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది.  

జట్ల వివరాలు
 అండర్‌–13 బాలికలు: దుర్గా భవాని, ఎం. మల్లీశ్వరి, ఎస్‌. శ్రావ్య, పి. పూజ, విజయ, నవనీత, సాయి స్నేహా, అర్షిన్, శీర్షా, సీమ.  
 అండర్‌–15 బాలికలు: గ్రీష్మ, కల్యాణి, శ్రావణి, త్రిషిక, శరణ్య, శిరీష, అఫ్రీన్, హారిక.

 అండర్‌–17 బాలికలు: బాలమణి, శీర్షా, భవాని, రేణుక, అంజుమ్, అంజలి, దివ్య, దీప్తి, సమీహ, ఫాతిమా, స్వాతి, భూమిక, తన్వీ.
 అండర్‌–19 బాలికలు: ప్రవళిక, భవాని శ్రీ, చందన, గాయత్రి, హారిక, స్వాతి, నవ్య, కె. అభినయ, బి. అభినయ, త్రిష, సానియా అంజుమ్‌.  సీనియర్‌ బాలికలు: కావ్య, స్వాతి, అఖిల, సునీత, మనస్విని, ఎస్‌. అఖిల, త్రివేణి, శీర్షా, సంఘవి, రమ్య.   

Advertisement
 
Advertisement
Advertisement