తొలిసారి భారత్ కు వచ్చిన టైగర్ వుడ్స్ | Tiger Woods arrives for date with Delhi Golf Club | Sakshi
Sakshi News home page

తొలిసారి భారత్ కు వచ్చిన టైగర్ వుడ్స్

Feb 3 2014 8:51 PM | Updated on Sep 2 2017 3:18 AM

తొలిసారి భారత్ కు వచ్చిన టైగర్ వుడ్స్

తొలిసారి భారత్ కు వచ్చిన టైగర్ వుడ్స్

ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ సోమవారం న్యూఢిల్లీ వచ్చాడు. భారత పర్యటనకు తొలిసారి విచ్చేసిన వుడ్స్ మంగళవారం ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు.

న్యూఢిల్లీ: ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్  సోమవారం న్యూఢిల్లీ వచ్చాడు. భారత పర్యటనకు తొలిసారి విచ్చేసిన వుడ్స్ మంగళవారం ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. అగ్రశేణి మోటార్ సైకిల్ కంపెనీ హీరో మోటో కార్ప్ ఈ మ్యాచ్ నిర్వహిస్తోంది. ప్రపంచ నెంబర్ వన్ గోల్ఫ్ క్రీడాకారుడైన టైగర్ వుడ్స్.. దుబాయ్ నుంచి ఇక్కడికి చేరుకున్నాడు.

దుబాయ్ డిసర్ట్ క్లాసిక్ టోర్నమెంట్లో పాల్గొని ఇక్కడికి వచ్చాడు. మంగళవారం జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్లో హీరో మోటో కార్ప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పవర్ ముంజుల్, ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ సభ్యులతో అతడు తలపడతాడు. భారత అగ్రశ్రేణి గోల్ప్ క్రీడాకారులు శివ్ కపూర్, అనిర్బాన్ లాహిరితో అతడు పోటీ పడతాడు.

Advertisement
 
Advertisement
Advertisement