జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న భారత్ 82 పరుగులకు 4 వికెట్లు నష్టపోయింది.
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న భారత్ 82 పరుగులకు 4 వికెట్లు నష్టపోయింది. రహానే 15, విజయ్ 13, ఊతప్ప 31, మనోజ్ తివారి 10 పరుగులు చేసి అవుటయ్యారు.
టీమిండియా 33 ఓవర్లలో 123/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. మనీశ్ పాండే 28, జాదవ్ 19 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల ఈ సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది.