ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ | Team india practices at Uppal stadium | Sakshi
Sakshi News home page

ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్

Nov 8 2014 12:11 PM | Updated on Sep 2 2017 4:06 PM

భారత్ క్రికెట్ జట్టు శనివారం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే మూడో వన్డేలో

హైదరాబాద్ :  భారత్ క్రికెట్ జట్టు శనివారం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది.  ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే మూడో వన్డేలో భారత్, శ్రీలంక తలపడనున్న విషయం తెలిసిందే. దాంతో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్కు దిగారు.  కాగా ఉప్పల్ స్టేడియంలో మరోసారి ప్రేక్షకులకు పరుగుల వినోదం దక్కనుంది. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలాగే ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. నగరంలో మూడేళ్ల తర్వాత రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరగనున్న వన్డే కోసం బ్యాటింగ్ పిచ్ సిద్ధం చేశారు. కాగా గతంలో ఉప్పల్‌ స్టేడియంలో నాలుగు వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో భారత్ 1 గెలిచి, 3 మ్యాచ్లు ఓడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement