టి-20 ప్రపంచ కప్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ చివరి లీగ్ మ్యాచ్లో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో ధోనీసేన బ్యాటింగ్కు దిగింది.
మీర్పూర్: టి-20 ప్రపంచ కప్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ చివరి లీగ్ మ్యాచ్లో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో ధోనీసేన బ్యాటింగ్కు దిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
ఈ మెగా ఈవెంట్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్లపై గెలుపొందిన సంగతి తెలిసిందే. కంగారూలపైనా ఇదే జోరు కొనసాగించాలని సమరోత్సాహంతో ఉంది.