డబుల్స్‌ సెమీస్‌లో సుమీత్‌ రెడ్డి జంట ఓటమి  | Sumeet Reddy lost in doubles semi-finals | Sakshi
Sakshi News home page

డబుల్స్‌ సెమీస్‌లో సుమీత్‌ రెడ్డి జంట ఓటమి 

May 13 2018 1:46 AM | Updated on May 13 2018 1:46 AM

Sumeet Reddy lost in doubles semi-finals - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో బరిలో ఉన్న తెలంగాణ క్రీడాకారుడు సుమీత్‌ రెడ్డి తన భాగస్వామి మను అత్రితో కలిసి సెమీస్‌లో ఓడిపోయాడు. శనివారం సిడ్నీలో జరిగిన సెమీఫైనల్లో సుమీత్‌–మను ద్వయం 17–21, 15–21తో బెర్రీ అంగ్రియవాన్‌–హర్దియాంతో (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. సెమీస్‌లో ఓడిన సుమీత్‌ జంటకు 2,100 డాలర్ల (రూ. లక్షా 41 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.  

Advertisement
 
Advertisement
Advertisement