సెమీస్‌కు చేరువలో సౌత్ దులీప్ ట్రోఫీ | South Zone put one foot in semis of Duleep Trophy | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు చేరువలో సౌత్ దులీప్ ట్రోఫీ

Oct 6 2013 1:46 AM | Updated on Sep 1 2017 11:22 PM

వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో సెమీఫైనల్‌కు చేరువయింది. చెపాక్‌లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో తొలుత సౌత్‌జోన్ జట్టు 171.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 600 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి వెస్ట్‌జోన్ 76 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసింది.

చెన్నై: వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో సెమీఫైనల్‌కు చేరువయింది. చెపాక్‌లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో తొలుత సౌత్‌జోన్ జట్టు 171.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 600 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి వెస్ట్‌జోన్ 76 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసింది.
 
 వాగ్‌మోడ్ (57), బావ్నె (62 నాటౌట్) మినహా కీలక బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. బావ్నెతో పాటు ధ్రువ్ (0) క్రీజులో ఉన్నాడు. సౌత్ బౌలర్లలో రంగరాజన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ముకుంద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం సౌత్‌జోన్‌కు 444 పరుగుల ఆధిక్యం ఉంది. వెస్ట్ చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. మ్యాచ్‌కు ఆదివారం ఆఖరి రోజు. రెండు జట్ల రెండో ఇన్నింగ్స్ పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా సౌత్‌జోన్ సెమీస్‌కు చేరే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement