మంధాన మెరుపు బ్యాటింగ్‌

Smriti Mandhana Fastest Fifty - Sakshi

సాక్షి, ముంబై: భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన మరోసారి బ్యాట్‌తో విరుచుకుపడింది. మహిళల ముక్కోణపు టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్ధసెంచరీతో అదరగొట్టింది. వేగవంతమైన హాఫ్‌సెంచరీతో రికార్డు సాధించింది. 25 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసింది. భారత్‌ తరపున వేగవంతమైన హాఫ్‌సెంచరీ చేసిన బ్యాట్స్‌వుమన్‌గా ఘనతకెక్కింది.  

మిథాలీ రాజ్‌, మంధాన రాణించడంతో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు సాధించింది. మిథాలీ రాజ్‌ 43 బంతుల్లో 7 ఫోర్లుతో 53 పరుగులు చేసింది. మంధాన 40 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు సాధించింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 30, వస్త్రకార్‌ 22 పరుగులు బాదారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top