షెహ్‌జాద్ సెంచరీ | Shehzad century sets up massive win for Pakistan | Sakshi
Sakshi News home page

షెహ్‌జాద్ సెంచరీ

Mar 31 2014 2:40 AM | Updated on Sep 2 2017 5:22 AM

షెహ్‌జాద్ సెంచరీ

షెహ్‌జాద్ సెంచరీ

ఇప్పటి వరకూ టి20ల్లో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌లు (81) ఆడిన జట్టు పాకిస్థాన్. కానీ ఇన్నాళ్లూ ఆ జట్టుకు ఉన్న లోటు... ఒక్క పాక్ క్రికెటర్ కూడా సెంచరీ కొట్టలేదు.

పాకిస్థాన్ అర్ధ సెంచరీ
 బంగ్లాదేశ్‌పై అలవోక  విజయం
 ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్ వైఫల్యం
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 ఇప్పటి వరకూ టి20ల్లో అందరికంటే ఎక్కువ మ్యాచ్‌లు (81) ఆడిన జట్టు పాకిస్థాన్. కానీ ఇన్నాళ్లూ ఆ జట్టుకు ఉన్న లోటు... ఒక్క పాక్ క్రికెటర్ కూడా సెంచరీ కొట్టలేదు. ఎట్టకేలకు అహ్మద్ షెహ్‌జాద్ ఆ లోటు ఆదివారం తీర్చాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన సూపర్-10 గ్రూప్ ‘2’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై షెహ్‌జాద్ (62 బంతుల్లో 111 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. దీంతో పాకిస్థాన్ 50 పరుగులతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ గెలుపుతో అంతర్జాతీయ టి20ల్లో 50 విజయాలు సాధించిన తొలి జట్టుగా పాకిస్థాన్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన 11వ క్రికెటర్‌గా షెహజాద్ నిలిచాడు.
 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. షోయబ్ మాలిక్ (23 బంతుల్లో 26; 2 ఫోర్లు), ఆఫ్రిది (9 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రజాక్ రెండు వికెట్లు తీశాడు. అమిన్, షకీబ్, మహ్మదుల్లా ఒక్కో వికెట్ పడగొట్టారు.
 
 బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. షకీబ్ (32 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. దాంతో టోర్నీలో బంగ్లాదేశ్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడింది. పాక్ బౌలర్లలో గుల్ మూడు, అజ్మల్ రెండు వికెట్లు తీసుకోగా... బాబర్, ఆఫ్రిదిలకు ఒక్కో వికెట్ దక్కింది. షెహ్‌జాద్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
 టి20 ప్రపంచకప్‌లో నేడు
 ఇంగ్లండ్   x నెదర్లాండ్స్
 మధ్యాహ్నం గం. 3.00 నుంచి
 
 న్యూజిలాండ్ x శ్రీలంక
 రాత్రి గం. 7.00 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement