నేటి నుంచి సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌

sepak takraw championship starts today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌ నేటి నుంచి జరుగనుంది. ఎల్బీ ఇండోర్‌ స్టేడియం వేదికగా మహిళలు, పురుషుల విభాగాల్లో సోమవారం వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు చెందిన 38 పురుషుల జట్లు, 32 మహిళల జట్లు పాల్గొంటున్నాయి. ఈ మేరకు శుక్రవారం టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్‌ ఈ పోటీలను ప్రారంభిస్తారని వారు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ ఎస్‌. రామచంద్రం, ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ తదితరులు పాల్గొంటారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top