డబుల్స్‌ సెమీస్‌లో సాకేత్‌ జంట | saketh myneni pair enter semis of Vietnam open | Sakshi
Sakshi News home page

డబుల్స్‌ సెమీస్‌లో సాకేత్‌ జంట

Oct 28 2017 10:49 AM | Updated on Oct 28 2017 10:49 AM

saketh myneni pair enter semis of Vietnam open

వియత్నాం ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని పురుషుల డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. వియత్నాంలోని హో మిన్‌ చి సిటీలో శుక్రవారం జరిగిన డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) జంట 7–6 (8/6), 1–6, 10–4తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో అలెజాంబ్రో బేగా (ఇటలీ)–స్టీఫెన్‌ రాబర్ట్‌ (ఫ్రాన్స్‌) జోడీపై గెలిచింది. సింగిల్స్‌ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్‌) పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో యూకీ 6–3, 3–6, 6–7 (2/7)తో జాన్‌ మిల్‌మాన్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement