పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. భారత జట్టులో సాకేత్‌  | Davis Cup: AITA Names Five Member Squad For Play Off Tie | Sakshi
Sakshi News home page

Davis Cup: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. భారత జట్టులో సాకేత్‌ 

Dec 18 2023 8:36 AM | Updated on Dec 18 2023 9:18 AM

Davis Cup: AITA Names Five Member Squad For Play Off Tie - Sakshi

ఇస్లామాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌ జట్టుతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరిగే డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో పాల్గొనే భారత టెన్నిస్‌ జట్టును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్‌ మైనేని జట్టులోకి పునరాగమనం చేశాడు.

2022 సెప్టెంబర్‌లో నార్వేతో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో చివరిసారి సాకేత్‌ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రామ్‌కుమార్‌ రామనాథన్, శ్రీరామ్‌ బాలాజీ, యూకీ బాంబ్రీ, నిక్కీ పునాచా, దిగి్వజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement