క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌ | Saina enters quarters of Malaysia Masters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్‌

Jan 17 2019 1:10 PM | Updated on Jan 17 2019 1:11 PM

Saina enters quarters of Malaysia Masters - Sakshi

కౌలాలంపూర్‌ (మలేసియా):  భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్స్‌లోకి ప‍్రవేశించారు. మహిళల సింగిల్స్‌ భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోరులో సైనా నెహ్వాల్‌ 21-14, 21-16 తేడాతో యిప్‌ పుయ్‌ యిన్‌ (హాంకాంగ్‌)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు. కేవలం 39 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా ఆద్యంతం పైచేయి సాధించారు.  తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సైనా, రెండో గేమ్‌లో మాత్రం కాస్త పోరాడి గెలిచారు. శుక‍్రవారం జరుగనున్న క్వార్టర్‌ ఫైనల్లో  రెండో సీడ్‌ ఒకుహారా(జపాన్‌)తో సైనా తలపడతారు. ఇరువురి మధ్య ముఖాముఖి రికార్డులో సైనా 8-4తోముందంజలో ఉన్నారు. గతేడాది జరిగిన రెండు వరుస టోర్నమెంట్లలో(డెన్మార్క్ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌) ఒకుహారాపై సైనా విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement