తుది జట్టును15 మందితో ఆడించండి | Sachin Tendulkar's advice to MCA: Make school ties 15-players-a-side affair to increase talent pool | Sakshi
Sakshi News home page

తుది జట్టును15 మందితో ఆడించండి

Dec 4 2013 1:15 AM | Updated on Sep 2 2017 1:13 AM

తుది జట్టును15 మందితో ఆడించండి

తుది జట్టును15 మందితో ఆడించండి

మరింత మంది నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి రావాలంటే జట్టులో 11 మందికి బదులు 15 మందితో ఆడించాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు సూచించాడు.

ముంబై: మరింత మంది నాణ్యమైన క్రికెటర్లు వెలుగులోకి రావాలంటే జట్టులో 11 మందికి బదులు 15 మందితో ఆడించాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు సూచించాడు. ఎంసీఏ ఆధ్వర్యంలో మంగళవారం సచిన్‌కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఇంటర్ కాలేజి, ఇంటర్ స్కూల్ పోటీల్లో ఎంసీఏ తమ తుది జట్టులోని ఆటగాళ్ల సంఖ్యను పెంచాల్సిందిగా సూచించాడు. ‘ప్రత్యర్థి జట్లపై ముంబై క్రికెట్ ఎలా ఆధిక్యం సాధించాలనే అంశంపై నేను, మా అన్నయ్య ఓ సారి చర్చించుకున్నాం.
 
 ఆ సందర్భంగానే ఈ ఆలోచన వచ్చింది. ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజి మ్యాచ్‌ల్లో 11 మందికి బదులుగా 15 మందితో ఆడించాలి. ప్రతీ ఆటగాడు మ్యాచ్ ఆడేందుకే ఇంటి నుంచి బయల్దేరుతాడు. కానీ జట్టులో చోటు దొరుకుతుందా లేదా అనే అనుమానం ఉంటుంది. ఈ కొత్త ఆలోచనను అమల్లోకి తెచ్చి ప్రతీ ఆటగాడికి ఆడే అవకాశాన్ని కల్పిస్తే ముందు ఎంసీఏ లాభపడుతుంది’ అని మాస్టర్ అన్నాడు. అయితే ఈ విషయాన్ని తన కొడుకు అర్జున్ టెండూల్కర్‌ను దృష్టిలో ఉంచుకుని చె ప్పడం లేదని సచిన్ స్పష్టం చేశాడు. గతేడాది ముంబై అండర్-14 జట్టులో అర్జున్ సభ్యుడుగా ఉన్నాడు.
 
 భారతరత్నపై పిల్ కొట్టివేత
 చెన్నై: సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వడాన్ని నిరసిస్తూ దాఖలైన పిల్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గత నెల 29న న్యాయవాది కనకసబై ఈమేరకు కోర్టుకెక్కారు. నిబంధనలకు విరుద్ధంగా క్రీడాకారులకు ఈ అవార్డును అందజేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే ఈ అత్యున్నత అవార్డు కోసం క్రీడాకారుల పేర్లను కూడా పరిగణలోకి తీసుకోవచ్చని రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement