అంతర్ జిల్లా సీనియర్ పురుషుల ఫుట్బాల్ టోర్నమెంట్ టైటిల్ను రంగారెడ్డి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. మంచిర్యాలలోని రామకృష్ణాపురం ఠాగూర్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి జిల్లా 1-0 స్కోరుతో విశాఖపట్నంపై విజయం సాధించింది.
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: అంతర్ జిల్లా సీనియర్ పురుషుల ఫుట్బాల్ టోర్నమెంట్ టైటిల్ను రంగారెడ్డి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. మంచిర్యాలలోని రామకృష్ణాపురం ఠాగూర్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి జిల్లా 1-0 స్కోరుతో విశాఖపట్నంపై విజయం సాధించింది.
రంగారెడ్డి జిల్లా జట్టు తరఫున స్ట్రయికర్ శశాంక్ 55వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి జిల్లా జట్టు 3-1 స్కోరుతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఆదిలాబాద్ జట్టుపై గెలిచింది. రెండో సెమీఫైనల్లో విశాఖపట్నం 1-0తో నెల్లూరుపై నెగ్గింది.