రన్నరప్‌ సింధు | PV Sindhu loses to Nozomi Okuhara in final | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సింధు

Jul 16 2018 4:25 AM | Updated on Jul 16 2018 4:25 AM

PV Sindhu loses to Nozomi Okuhara in final - Sakshi

బ్యాంకాక్‌: ఈ ఏడాది తొలి టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 15–21, 18–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌) చేతిలో ఓడిపోయింది.

ఈ ఏడాది ఫైనల్‌ పోరులో ఓడిపోవడం సింధుకిది మూడోసారి. ఇండియా ఓపెన్, కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫైనల్స్‌లోనూ సింధు ఓటమి చవిచూసింది.  విజేత ఒకుహారాకు 26,250 డాలర్ల (రూ. 17 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీ, 9,200 పాయింట్లు... రన్నరప్‌ సింధుకు 13,300 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 11 వేలు), 7800 పాయింట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement