breaking news
won the match
-
మూడో టీ20లో భారత్ పై 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
-
హోమ్ గ్రౌండ్లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్
-
ముంబై విజయనాదం
చిన్న మైదానం... డికాక్, కృనాల్ బ్యాటింగ్ మెరుపులు... బుమ్రా, బౌల్ట్ బౌలింగ్ విన్యాసాలు... వెరసి ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. ఎప్పటిలాగే మిడిలార్డర్ వైఫల్యం... ఒకరిద్దరిపైనే బ్యాటింగ్ భారం... ప్రధాన పేసర్ భువనేశ్వర్ లేకపోవడం సన్రైజర్స్కు చేటు చేయగా... డెత్ ఓవర్లలో మరింత చెలరేగిన ముంబై బౌలర్లు జట్టుకు ఘనవిజయాన్ని అందించారు. షార్జా: అన్ని విభాగాల్లో అదరగొట్టిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో మరో జబర్దస్త్ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను రోహిత్ శర్మ బృందం 34 పరుగులతో చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. డికాక్ (39 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించగా... కృనాల్ పాండ్యా (4 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివర్లో విధ్వంసం సృష్టించాడు. భువనేశ్వర్ స్థానంలో వచ్చిన సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ను భర్తీ చేసిన సిద్ధార్థ్ కౌల్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం సన్రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ వార్నర్ (44 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా తలా 2 వికెట్లు తీశారు. రోహిత్ ఔటైనా... భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ అదే రీతిలో చెలరేగింది. తొలి ఓవర్లోనే సిక్స్ కొట్టి దూకుడు మీదున్న రోహిత్ (6) వికెట్ను రివ్యూ ద్వారా రైజర్స్ దక్కించుకుంది. తర్వాత డికాక్తో కలిసి సూర్యకుమార్ (27; 6 ఫోర్లు) దూకుడు కనబరిచాడు. కౌల్ను లక్ష్యంగా చేసుకొని మూడు వరుస బౌండరీలతో కలిపి అతను మొత్తం 5 ఫోర్లు బాదాడు. చివరికి అతని బౌలింగ్లోనే నటరాజన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పవర్ప్లేలో ముంబై 48/2తో నిలిచింది. డికాక్ దూకుడు... 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లాంగాన్లో కఠినమైన క్యాచ్ను మనీశ్ పాండే వదిలేయడంతో బతికిపోయిన డికాక్ తర్వాత చెలరేగాడు. అతనికి ఇషాన్ కిషన్ చక్కని సహకారం అందించాడు. సమద్ బౌలింగ్లో 6, 4 బాదిన డికాక్... విలియమ్సన్ ఓవర్లో సిక్సర్తో అర్ధసెంచరీ సాధించాడు. ఇదే ఓవర్లో ఇషాన్ మరో సిక్స్ బాదడంతో మొత్తం 17 పరుగులు వచ్చాయి. వెంటనే మరో 4, 6 బాది ప్రమాదకరంగా మారుతోన్న డికాక్ను రషీద్ఖాన్ దొరకబుచ్చుకున్నాడు. దీంతో మూడో వికెట్కు 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరికాసేటికే పాండే అద్బుత క్యాచ్కు ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. పాండ్యా బ్రదర్స్ జోరు... పొలార్డ్ (13 బంతుల్లో 25 నాటౌట్; 3 సిక్సర్లు )తో కలిసి పాండ్యా బ్రదర్స్ హార్దిక్, కృనాల్ చివరి 18 బంతుల్లో 49 పరుగులు సాధించారు. 18వ ఓవర్లో సందీప్ బౌలింగ్లో పొలార్డ్ రెండు సిక్సర్లు బాదగా... అంతకుముందే హార్దిక్ (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో రెండు సిక్సర్లతో చెలరేగాడు. వీరిద్దరూ కలిసి నటరాజన్ వేసిన 19వ ఓవర్లో 13 పరుగులు సాధించారు. చివరి ఓవర్లో హార్దిక్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కృనాల్ తాను ఎదుర్కొన్న చివరి నాలుగు బంతుల్లో వరుసగా 6, 4, 4, 6తో వీరవిహారం చేశాడు. వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్... మరోసారి రైజర్స్ బ్యాటింగ్ ఒక్కరిపైనే ఆధారపడింది. కెప్టెన్ వార్నర్ మినహా మిగతా బ్యాట్స్మెన్న్ముంబై బౌలింగ్కు తలొంచారు. బెయిర్స్టో (25), మనీశ్ పాండే (30; 4 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (3)లను కట్టడి చేసి ముంబై మ్యాచ్పై పట్టు సాధించింది. మరోవైపు 34 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన వార్నర్... జట్టు స్కోరు 142/4 వద్ద ఔట్ కావడంతో మ్యాచ్ ముంబై వశమైపోయింది. బుమ్రా, బౌల్ట్ లాంటి కట్టుదిట్టమైన బౌలింగ్కు యువ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ (10), ప్రియమ్ గార్గ్ (8), సమద్ (20) చేతులెత్తేశారు. దీంతో రైజర్స్ ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) బెయిర్స్టో (బి) సందీప్ 6; డికాక్ (సి అండ్ బి) రషీద్ ఖాన్ 67; సూర్యకుమార్ (సి) నటరాజన్ (బి) కౌల్ 27; ఇషాన్ కిషన్ (సి) మనీశ్ (బి) సందీప్ 31; హార్దిక్ (బి) కౌల్ 28; పొలార్డ్ (నాటౌట్) 25; కృనాల్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–6, 2–48, 3–126, 4–147, 5–188. బౌలింగ్: సందీప్ 4–0–41–2, నటరాజన్ 4–0–29–0, సిద్ధార్థ్ కౌల్ 4–0–64–2, సమద్ 2–0–27–0, రషీద్ ఖాన్ 4–0–22–1, విలియమ్సన్ 2–0–24–0. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఇషాన్ (బి) ప్యాటిన్సన్ 60; బెయిర్స్టో (సి) హార్దిక్ (బి) బౌల్ట్ 25; మనీశ్ (సి) పొలార్డ్ (బి) ప్యాటిన్సన్ 30; విలియమ్సన్ (సి) డికాక్ (బి) బౌల్ట్ 3; ప్రియమ్ గార్గ్ (సి) రాహుల్ చహర్ (బి) కృనాల్ 8; అభిషేక్ శర్మ (బి) బుమ్రా 10; సమద్ (సి) రోహిత్ (బి) బుమ్రా 20; రషీద్ ఖాన్ (నాటౌట్) 3; సందీప్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–34, 2–94, 3–116, 4–130, 5–142, 6–168, 7–172. బౌలింగ్: బౌల్ట్ 4–0–28–2, ప్యాటిన్సన్ 4–0–29–2, కృనాల్ పాండ్యా 4–0–35–1, బుమ్రా 4–0–41–2, పొలార్డ్ 3–0–20–0, రాహుల్ చహర్ 1–0–16–0. -
చిత్తుగా ఓడిన పాక్ ; ఫైనల్లో టీమిండియా
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ విధించిన 173 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. టీమిండియా 35.2 ఓవర్లలో 176 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో దాయాది జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్105*పరుగులు(113 బంతులు, 8 ఫోర్లు, 4సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా, దివ్యాన్ష్ సక్సేనా 59*పరుగులు(99 బంతులు, 6 ఫోర్లు) అర్థ సెంచరీ చేయడంతో టీమిండియా మరో 14 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను చేజిక్కించుకొన్నారు. భారత ఓపెనర్లను ఎలా కట్టడి చేయాలో అర్థంకాక పాక్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. కాగా గురువారం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ల మధ్య జరగనున్న రెండో సెమీస్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో టీమిండియా తుది పోరుకు సిద్ధమవనుంది. కాగా అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ పోరు ఫిబ్రవరి 9(ఆదివారం) ఇదే స్టేడియంలో జరగనుంది. అంతకుముందు భారత బౌలర్ల దాటికి పాక్ జట్టు 43.1 ఓవరల్లో 172 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ రోహైల్ నాజిర్లు అర్థ శతకాలతో రాణించడంతో పాక్ జట్టు ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. వీరిద్దరు తప్ప మిగతా బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాగా భారత బౌలర్లలో సుషాంత్ మిశ్రా 3 వికెట్లతో రాణించగా, రవి బిష్ణోయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు, అంకోల్కెర్, యశస్వి జైశ్వాల్లు ఒక్కో వికెట్ తీశారు. -
రన్నరప్ సింధు
బ్యాంకాక్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో ఆమె రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 15–21, 18–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఫైనల్ పోరులో ఓడిపోవడం సింధుకిది మూడోసారి. ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్లోనూ సింధు ఓటమి చవిచూసింది. విజేత ఒకుహారాకు 26,250 డాలర్ల (రూ. 17 లక్షల 98 వేలు) ప్రైజ్మనీ, 9,200 పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 9 లక్షల 11 వేలు), 7800 పాయింట్లు లభించాయి. -
జర్నలిస్టుల జట్టు విజయకేతనం
అనంతపురం సప్తగిరిసర్కిల్ : జర్నలిస్టుల జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, జర్నలిస్టుల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి రిలయన్స్ జట్టు ఫీల్డింగ్ను ఎంచుకుంది. దీంతో జర్నలిస్టుల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. జట్టులో యుగంధర్రెడ్డి 58, గోపాల్ 20 పరుగులు సాధించారు. అనంతరం భారీ లక్ష్యంతో దిగిన రిలయన్స్ జట్టు మొదట తన దూకుడును ప్రదర్శించింది. 15 ఓవర్లలో 150 పరుగులు చేసి, కేవలం 1 వికెట్ను మాత్రమే కోల్పోయింది. అనంతరం తేజప్రసాద్ బౌలింగ్ వేసి, ఒకే ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి రిలయన్స్ జట్టును కష్టాల్లోకి పడేశారు. దీంతో రిలయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 165 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. దీంతో జర్నలిస్టుల జట్టు విజయకేతనాన్ని ఎగరేసింది.రిలయన్స్ జట్టులో సుధాకర్ 89 పరుగులు సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా సుధాకర్కు ట్రోఫీని అందించారు. గెలుపొందిన జట్టుకు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి ట్రోఫీని అందించారు. దీంతో 4 టోర్నీల సీరిస్లో జర్నలిస్టుల జట్టు 2–1తో ముందంజలో నిలిచింది. గత ఆదివారం స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్లోనూ జర్నలిస్టుల జట్టు విజయం సాధించింది.