హైదరాబాద్ కెప్టెన్గా పూజ
సాక్షి, హైదరాబాద్: సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ అండర్–16 మహిళా జట్టును శుక్రవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా వంకా పూజ వ్యవహరించనుంది. కేరళలోని ఎర్నాకుళంలో ఈ నెల 10 నుంచి 17 వరకు ఈ టోర్నీ జరగుతుంది. జట్టు వివరాలు: వి. పూజ (కెప్టెన్), జి. త్రిష, హెన్రిట్టా ఫ్లేవియా పెరీరా, త్రిషా పూజిత, ఎం.మమత (వికెట్ కీపర్), అలివేలు (వికెట్ కీపర్), సువార్త, పి. చరిష్మా, హర్లీన్ కౌర్, బి. శ్రీవైష్ణవి, హాసిని, కె. ప్రియాంక, పీవీ చంద్రస్మిత, ఎ. భవిష్య, క్రాంతి రెడ్డి.
మరిన్ని వార్తలు