మరో వివాదంలో పాకిస్థాన్ క్రికెటర్లు | Pakistan fielding coach complains of players' abusive behaviour | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో పాకిస్థాన్ క్రికెటర్లు

Feb 18 2015 11:33 AM | Updated on Jul 25 2018 1:57 PM

మరో వివాదంలో పాకిస్థాన్ క్రికెటర్లు - Sakshi

మరో వివాదంలో పాకిస్థాన్ క్రికెటర్లు

ప్రపంచకప్ లో అడుగుపెట్టిన నాటి నుంచి వివాదాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు మరోసారి వార్తల్లోకెక్కారు.

కరాచీ: ప్రపంచకప్ లో అడుగుపెట్టిన నాటి నుంచి వివాదాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు మరోసారి వార్తల్లోకెక్కారు. పాకిస్థాన్ సీనియర్  క్రికెటర్లు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లుడెన్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇటువంటి అవమానకర ప్రవర్తనను తాను సహించబోనని, ఫీల్డింగ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తానని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ కు మెసేజ్ పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మంగళవారం ప్రాక్టీసు చేస్తున్నప్పుడు షాహిద్ ఆఫ్రిది, అహ్మద్ షెహజాద్, ఉమర్ అక్మాల్ తనను దూషించారని లుడెన్ ఆరోపించాడు. అయితే లెడెన్ ఫిర్యాదు చేసిన విషయాన్ని పీబీసీ ఇంకా ధ్రువీకరించలేదు. టీమిండియాతో జరిగిన మ్యాచ్ కు ముందు టీమ్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు షాహిద్ ఆఫ్రిది సహా 8 మందికి జట్టు మేనేజ్ మెంట్ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement