నిఖత్ జోడీకి రజతం | Nikhat a pair of silver medal | Sakshi
Sakshi News home page

నిఖత్ జోడీకి రజతం

Jan 12 2014 1:11 AM | Updated on Sep 4 2018 5:07 PM

జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ బాను రజత పతకం సాధించింది.

 సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ బాను రజత పతకం సాధించింది. శనివారం పాట్నాలో జరిగిన ఈ పోటీల్లోని మహిళల డబుల్స్ విభాగంలో నిఖత్-కృత్విక సిన్హా రాయ్ జంట రన్నరప్‌గా నిలిచింది.
 
  ఫైనల్లో అనందిత చక్రవర్తి-పల్లవి కుందు (రైల్వేస్) ద్వయం 9-11, 11-6, 12-10, 11-5తో నిఖత్-కృత్విక జంటపై గెలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో నిఖత్-కృత్విక జోడి తో 3-1తో చార్వి కావ్లే-ప్రీతి జోడి (మహారాష్ట్ర బీ)పై గెలుపొందింది.ఈ పోటీల్లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తరఫున బరిలోకి దిగిన నిఖత్ టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement