భారత హాకీ పురుషుల జట్టు నిరాశ పరిచింది.
భారత హాకీ పురుషుల జట్టు నిరాశ పరిచింది. గ్రూప్-బిలో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ జట్టు చేతిలో 2-1 తేడాతో భారత్ ఓటమి పాలైంది. తొలి రెండు క్వార్టర్స్ సమయంలో ఇరు జట్లు హోరా హోరీగా గోల్ కోసం యత్నాలు చేసినా ఖాతా తెరవలేదు. అయితే మూడు, నాలుగో క్వార్టర్స్ సమయాలలో నెదర్లాండ్ రెండు గోల్స్ చేయగా, భారత్ ఒక్క గోల్ నమోదు చేయడంతో ఓటమి పాలైంది. అయితే భారత్ కు క్వార్టర్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.