మన్‌దీప్‌సింగ్‌ హ్యట్రిక్‌ | Mandeeping Hathrick | Sakshi
Sakshi News home page

మన్‌దీప్‌సింగ్‌ హ్యట్రిక్‌

May 3 2017 10:53 PM | Updated on Sep 5 2017 10:19 AM

మన్‌దీప్‌సింగ్‌ హ్యట్రిక్‌

మన్‌దీప్‌సింగ్‌ హ్యట్రిక్‌

మలేసియాలో జరుగుతున్న సుల్తాన్‌ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారత్‌ తొలి విజయం నమోదు చేసింది.

జపాన్‌పై భారత్‌ విజయం

ఇపో: మలేసియాలో జరుగుతున్న సుల్తాన్‌ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారత్‌ తొలి విజయం నమోదు చేసింది. బుధవారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్ట్రైకర్‌ మన్‌దీప్‌ సింగ్‌ ‘హ్యాట్రిక్‌’ గోల్స్‌ నమోదు చేయడంతో 4–3తో టీమిండియా గెలుపొందింది. ఆట ఆరంభం (ఎనిమిదో నిమిషం)లో జట్టుకు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్‌ పాల్‌ సింగ్‌ గోల్‌గా మలవడంతో 1–0తో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కాసేపటికే కజుమా మారతా (10వ నిమిషం)లో గోల్‌ చేయడంతో స్కోరును 1–1తో జపాన్‌ సమం చేసింది. అనంతరం ఇరుజట్లు గోల్‌ చేయడంలో రెండు క్వార్టర్లు ముగిసేసరికి గేమ్‌ సమంగా నిలిచింది.

అయితే రెండు నిమిషాల వ్యవధిలో హీతా యోషిహరా (43వ ని.),లో గోల్‌ సాధించడంతో జపాన్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కాసేపటికే మన్‌దీప్‌ సింగ్‌ తన తొలిగోల్‌ నమోదు చేయడంతో 2–2తో భారత్‌ స్కోరు సమం చేసింది. అయితే గెంకి మితాని (45వ ని.)లో గోల్‌ చేయడంతో జపాన్‌ 3–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే పది నిమిషాల తర్వాత కళ్లు చెదిరే రీతిలో మన్‌దీప్‌ మరోగోల్‌ చేయడంతో 3–3తో స్కోరును సమం చేసింది. మరో రెండు నిమిషాల తర్వాత మన్‌దీప్‌ మూడో గోల్‌ చేయడంతో 4–3తో భారత్‌ తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరిదాక ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్‌ విజేతగా నిలిచింది.

టోర్నీ నుంచి తప్పుకున్న శ్రీజేశ్‌
మరోవైపు మోకాలి గాయంతో కెప్టెన్‌ శ్రీజేశ్‌ జట్టు నుంచి తప్పుకున్నాడు. గాయం తగ్గడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని చీఫ్‌ కోచ్‌ రోలాంట్‌ ఓల్ట్‌మన్స్‌ పేర్కొన్నారు. దీంతో జూన్‌లో లండన్‌లోజరిగే వరల్డ్‌ లీగ్‌ సెమీస్‌కు దూరమవుతాడని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement