సెమీస్‌లో భారత్‌ బోల్తా | malaysia beats india in sepak takraw | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో భారత్‌ బోల్తా

Nov 5 2017 11:29 AM | Updated on Nov 5 2017 11:29 AM

malaysia beats india in sepak takraw - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో తొలిసారి జరుగుతోన్న సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో మన ఆటగాళ్ల పోరాటం ముగిసింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో ఓటమి పాలైంది. శనివారం జరిగిన పురుషుల టీమ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌ పోటీల్లో భారత్‌ 16–21, 8–21తో మలేసియా చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. భారత మహిళల జట్టు క్వార్టర్స్‌లో నిష్క్రమించింది. మరో సెమీస్‌లో థాయ్‌లాండ్‌ 21–5, 21–8తో సింగపూర్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement