
పేస్ జంట ఓటమి
బీఎండబ్ల్యూ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట పోరాటం ముగిసింది.
మ్యూనిచ్ (జర్మనీ) : బీఎండబ్ల్యూ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జంట పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో పేస్-స్టెపానెక్ జోడీ 2-6, 1-6తో టాప్ సీడ్ బ్రూనో సోరెస్ (బ్రెజిల్)-అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో పేస్ జంట ఆరంభం నుంచే ప్రత్యర్థి జోడీ దూకుడుకు సమాధానం ఇవ్వలేకపోయింది. తమ సర్వీస్ను మాత్రం నాలుగుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఈ సీజన్లో తాను ఆడిన గత ఐదు టోర్నీల్లో ముగ్గురు వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగిన పేస్ కేవలం రెండు మ్యాచ్ల్లోనే గెలుపొందడం గమనార్హం.