సెమీస్‌లో భారత్ | Kabaddi World Cup: India beat England 69-18, qualify for the semifinal | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో భారత్

Oct 19 2016 12:16 AM | Updated on Sep 4 2017 5:36 PM

సెమీస్‌లో భారత్

సెమీస్‌లో భారత్

కీలకమైన మ్యాచ్‌లో హడలెత్తించిన భారత జట్టు ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

 అహ్మదాబాద్: కీలకమైన మ్యాచ్‌లో హడలెత్తించిన భారత జట్టు ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 69-18తో ఘనవిజయం సాధించింది. ఈ విజ యంతో భారత్ గ్రూప్ ‘ఎ’లో 21 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 25 పాయింట్లతో దక్షిణ కొరియా గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఆద్యంతం టీమిండియా ఆధిపత్యం కనిపించింది.
 
 ఆరంభంలోనే 12-3తో ముందంజ వేసిన భారత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ప్రదీప్ నర్వాల్ 13 పాయింట్లు, అజయ్ ఠాకూర్ 11 పాయింట్లు... నితిన్ తోమర్, సందీప్ నర్వాల్ 7 చొప్పున పాయింట్లు సాధించి భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. గ్రూప్ ‘బి’ నుంచి ఇప్పటికే ఇరాన్ సెమీస్‌కు చేరగా... రెండో బెర్త్ కోసం థాయ్‌లాండ్, కెన్యా, జపాన్ జట్లు రేసులో ఉన్నాయి. బుధవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో అర్జెంటీనా.... థాయ్‌లాండ్‌తో జపాన్ తలపడతాయి.  భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరో బుధవా రం లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఖరారవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement