భారత మహిళల హాకీ జట్టు ఓటమి | Indian women's hockey team lost | Sakshi
Sakshi News home page

భారత మహిళల హాకీ జట్టు ఓటమి

May 15 2017 12:31 AM | Updated on Sep 5 2017 11:09 AM

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది

ప్యుకెకోహి (న్యూజిలాండ్‌): న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 1–4 తేడాతో కివీస్‌ చేతిలో ఓడిపోయింది.

భారత్‌ తరఫున అనూపా బార్లా (31వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేసింది. న్యూజిలాండ్‌ జట్టుకు జోర్డాన్‌ గ్రాంట్‌ (13వ ని.లో), ఒలీవియా మెర్రీ (23వ ని.లో), రాచెల్‌ మెక్‌కాన్‌ (43వ ని.లో), దియానా రిచీ (55వ ని.లో) ఒక్కో గోల్‌ అందించారు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌ మంగళవారం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement