అమెరికాపై భారత్ గెలుపు | India Win on United States of America | Sakshi
Sakshi News home page

అమెరికాపై భారత్ గెలుపు

Jun 18 2015 12:37 AM | Updated on Sep 3 2017 3:53 AM

ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా జరిగిన మూడో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 4-0తో అమెరికాపై విజయం సాధించింది.

 బెల్జియం: ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా జరిగిన మూడో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 4-0తో అమెరికాపై విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సర్దార్‌సేన అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం కనబర్చింది. రూపిందర్ పాల్ (20, 52వ ని.), లలిత్ ఉపాధ్యాయ (49వ ని.), యువరాజ్ వాల్మీకి (60వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. మరోవైపు మహిళల విభాగంలో భారత్ 1-2తో ఇటలీ చేతిలో ఓడింది. రీతూ రాణి పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్‌కు ఏకైక గోల్ అందించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement