భారత్‌కు ఆరో స్థానం | India has got sixth in the Hockey World League semifinals tournament. | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఆరో స్థానం

Jun 26 2017 3:36 AM | Updated on Sep 5 2017 2:27 PM

హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ఆరో స్థానం లభించింది.

లండన్‌: హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ఆరో స్థానం లభించింది. 5–6 స్థానాల కోసం ఆదివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 2–3తో కెనడా చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో కెనడా జట్టు వచ్చే ఏడాది భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ (7వ, 22వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించాడు. కెనడా జట్టుకు గార్డన్‌ (3వ, 44వ నిమిషాల్లో) రెండు గోల్స్‌... కీగన్‌ (40వ నిమిషంలో) ఒక గోల్‌ అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement