మూడో స్థానంతో ముగింపు | India bag USD 265,000 for finishing third in ICC Test rankings | Sakshi
Sakshi News home page

మూడో స్థానంతో ముగింపు

Apr 16 2014 1:10 AM | Updated on Sep 2 2017 6:04 AM

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఈ ఏడాదిని మూడో ర్యాంకుతో ముగించింది. దీంతో 2 లక్షల 65 వేల డాలర్ల (రూ. కోటి 60 లక్షలు) చెక్‌ను అందుకుంది.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్
 దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఈ ఏడాదిని మూడో ర్యాంకుతో ముగించింది. దీంతో 2 లక్షల 65 వేల డాలర్ల (రూ. కోటి 60 లక్షలు) చెక్‌ను అందుకుంది. ఈనెల 1 వరకు ఈ ర్యాంకులకు కటాఫ్ తేదీగా ఉంది. వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 4 లక్షల 75 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 86 లక్షలు) అందాయి.

రెండో స్థానం పొందిన ఆసీస్‌కు 3 లక్షల 70 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 23 లక్షలు), నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌కు లక్షా 60 వేల డాలర్లు (రూ.96 లక్షల 36 వేలు) పొందాయి. ఆగస్టు 2012 నుంచి సఫారీ జట్టు తమ అద్భుత ప్రదర్శనతో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ‘ఐసీసీ టెస్ట్ ప్రైజ్‌మనీని తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆటగాళ్లు, టీమ్ మేనేజిమెంట్ తరఫునే కాకుండా మొత్తం దక్షిణాఫ్రికా ప్రజల తరఫున ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని సీఎస్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గాట్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement